కొవిడ్-19 పై సదస్సు నిర్వహించిన కమిషనర్
చిలకలూరిపేట నియోజకవర్గం పరిధిలోని ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి కరోనాను తరిమికొట్టాలని మున్సిపల్ కమిషనర్ రవీంద్ర అన్నారు. కరోనా పై అవగాహన సదస్సులో భాగంగా మున్సిపల్ కార్యాలయంలో మీరు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక దూరం పాటించి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కరోనా పై ప్రభుత్వం ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకొని, పరీక్షలు నిర్వహిస్తోందన్నారు. సిబ్బంది తగు జాగ్రత్తలతో ప్రజల్లో అవేర్నెస్ కల్పించాలని శానిటైజర్ వాడాలని తగు సూచనలు చేశారు. ఈ సమావేశంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు రమణ రావు, శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment