చిలకలూరిపేట పట్టణంలోని శాఖా గ్రంధాలయంలో షేక్ లాలూ దాదా సాహెబ్ సేవా సమితి ఆధ్వర్యంలో షేక్ సిద్ధాంతి కరిముల్లా ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి, చిత్రపటాలను స్థానిక శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా పుల్లారావు గారు మాట్లాడుతూ గ్రంధాలయం అభివృద్ధికి కృషి చేయనున్నట్టు హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అద్యక్షులు తేళ్ల సుబ్బారావు గారు అందించిన 10 వేల రూపాయల విలువగల పోటీ పరీక్షల పుస్తకాలను పుల్లారావు గారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిద్ధాంతి కరిముల్లా, చేవూరి కృష్ణమూర్తి, వార్డు కౌన్సిలర్ కొత్త కుమారి, కొటేశ్వరావు, గ్రంథాలయ అధికారి నాగుల్ మీరా వలి, గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Friday, August 2, 2024
- Blogger Comments
- Facebook Comments
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment